క్రికెట్ వరల్డ్ కప్లో ఆడిన మొదటి
మ్యాచ్లో ఓటమి పాలైన ఇంగ్లండ్, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘనవిజయం
సాదించింది. బ్యాటింగ్లో మలన్ 140 పరుగులతో చెలరేగిపోగా, బౌలింగ్లో టాప్లీ
విజృంభించి 43 పరుగులకు 4 వికెట్లు తీసాడు. బంగ్లాదేశ్ ఏ దశలోనూ ఇంగ్లండ్కు పోటీ
ఇవ్వలేకపోయింది. 137 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్ల
నష్టానికి 364 పరుగులు చేసి, బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. మలన్ 140 రన్స్,
రూట్ 82, బెయిర్స్టో 52 పరుగులతో చెలరేగిపోయారు. మలన్, బెయిర్స్టో జంట మొదటి
వికెట్కు 115 పరుగులు జోడించారు. 18వ ఓవర్లో బెయిర్స్టోను ఔట్ అయ్యాక వచ్చిన రూట్ కూడా బలంగా ఆడాడు. 91 బాల్స్లో సెంచరీ పూర్తి చేసిన మలన్, తర్వాత ఇంకా రెచ్చిపోయాడు. ఒక
ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 సాధించాడు. 38వ ఓవర్లో ఔట్ అయిన మలన్, రూట్తో కలిసి రెండో వికెట్కు 151 పరుగులు జోడించాడు. మలన్ ఔట్ తర్వాత ఇంగ్లండ్ ఆట మందగించింది. చివరి
10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ భారీ లక్ష్యఛేదనలో తడబడింది. ఇంగ్లిష్
బౌలర్ టాప్లీ ధాటికి 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జట్టు
స్కోరు 49 వద్ద మిరాజ్ కూడా ఔట్ అయ్యాడు. లిటన్ దాస్, ముష్ఫికర్ అయిదో వికెట్కు 72 పరుగులు జోడించారు. ముష్ఫికర్ ఔటయ్యాక.. హృదోయ్తో లిటన్ 43 పరుగులు జోడించాడు. కానీ లిటన్ ప్రయత్నం వృధా అయింది. బంగ్లాదేశ్ క్రమం
తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 48.2 ఓవర్లకే 227 పరుగుల వద్ద ఆలౌట్ అయి, భారీ
ఓటమి చవిచూసింది.