Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

NewsClick FIR : విదేశాల నుంచి అక్రమంగా నిధులు : న్యూస్‌క్లిక్ ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?

param by param
May 11, 2024, 06:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు విదేశాల నుంచి అక్రమ మార్గంలో నిధులు అందాయా? భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే కుట్ర జరిగిందా? అసలు న్యూస్‌క్లిక్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయంటూ 2021లోనే ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గత వారం న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తితోపాటు పలువురు విలేకరులు, పౌర సమాజ కార్యకర్తల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీరంతా భారతదేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా, దేశంలో అసంతృప్తిని రగిలించేలా ప్రయత్నిస్తున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

విదేశీ సంస్థల ద్వారా దేశానికి హాని చేసే విధంగా అక్రమంగా 2018 ఏప్రిల్ నుంచి న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి కోట్ల రూపాయల నిధులు వచ్చాయని ఈడీ కేసులో పేర్కొంది.
చైనా ప్రభుత్వ మీడియాతో సన్నిహిత సంబంధాలు కలిగిన అమెరికన్ కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్ ద్వారా న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

చైనా అనుకూల ప్రచారానికి మద్దతు పలికే ఆర్థిక నెట్‌వర్క్‌కు సింఘమ్ సంబంధాలు కలిగి ఉన్నాడని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అతను చైనాలోని షాంఘైలో నివాసం ఉంటున్నట్టు టైమ్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.

న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ పురకాయస్థ, మరికొందరు దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా వ్వవహరిస్తున్నారని, 2020-21 ఢిల్లీలో రైతుల నిరసనల ప్రచారం వెనుక కూడా న్యూస్‌క్లిక్ పోర్టల్ సిబ్బంది హస్త ముందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ వివాదాస్పద భూభాగాలంటూ కుట్ర పన్నినట్లు కేసు రిపోర్టులో తెలిపారు.కోవిడ్-19 అదుపు చేయడంలో భారత ప్రభుత్వ ప్రయత్నాలను కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచురించారు. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ పురకాయస్థ, చక్రవర్తి ఎఫ్‌ఐఆర్ కాపీలు పొందడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది.వారి అభ్యర్థనను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఇప్పటికే వారి అరెస్టుకు ఆధారాలు అందించామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

విదేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు రూ.38 కోట్ల నిధులు అందాయనే కేసులో ఇద్దరు కీలక వ్యక్తులను మంగళవారం అరెస్టు చేయగా, వందలాది మంది విలేకరులను ప్రశ్నించి వదిలేశారు. న్యూస్‌క్లిక్‌కు అక్రమ మార్గాల్లో అందిన నిధులను సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవ్లాఖాతో పంచుకున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.

ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.