T20 Cricket :నేపాల్ వరల్డ్ రికార్డులు
చైనాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో పురుషుల టీ20 వరల్డ్ కప్లో సంచలనాలు నమోదయ్యాయి. నేపాల్ మంగోలియా దేశాల మధ్య ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన మంగోలియా నేపాల్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
నేపాల్ ఓపెనర్లు భుర్తేల్ 19, ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుటయ్యారు. వన్డౌన్లో దిగిన కుశాల్ మల్లా మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సులతో 137 పరుగులు సాధించి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. నేపాల్ కెప్టెన్ రోహిత్ 27 బంతుల్లో 67 పరుగులు చేశారు. ఐదో స్థానంలో బరిలోకి దిగిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీపేంద్ర అజేయంగా నిలవడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి టీ20లోనే అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పారు.
టీ20 ఫార్మాట్లో నేపాల్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. 2019లో ఐర్లాండ్తో ఆఫ్ఘన్ ఆడిన మ్యాచ్లో 3 వికెట్లు కోల్పోయి 278 పరుగుల రికార్డును తాజాగా నేపాల్ జట్టు చెరిపేసింది. టీ20 చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్గా నేపాల్ నిలిచింది.ఇవాళ జరిగిన మ్యాచ్లో ఏకంగా 22 సిక్సర్లు కొట్టారు. 315 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన మంగోలియా జట్టు 41 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 273 పరుగుల తేడాతో నేపాల్ విజయం సాధించింది. ఈ విజయం కూడా టీ20లో ఓ రికార్డుగా నమోదైంది.