ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. షూటింగ్లో ఒకే రోజు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను భాకర్, ఈషా సింగ్, సంగ్వాన్ బృందం 1759 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మహిళల విభాగంలో కౌర్ సమ్రా, ఆషి చౌష్కీ, కౌషిక్ బృందం 1764 పాయింట్లతో రజత పతకం సాధించారు. ఈ విభాగంలో చైనా బంగారు పతకాన్ని దక్కించుకుంది.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సమ్రా కౌర్ 469.6 పాయింట్లతో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. చైనా అథ్లెట్ జంగ్ 462.3 పాయింట్లు సాధించి రజతం దక్కించుకున్నారు. భారత షూటర్ అషి చౌష్కీ 451.9 పాయింట్లు సాధించి కాంస్యం సాధించారు. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు
18 పతకాలు సాధించగా, ఇందులో 5 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి.