ఆసియన్ గేమ్స్ మూడోరోజు భారత్ మరో పతకం
గెలిచింది. సెయిలింగ్ పోటీల్లో నేహా ఠాకూర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం
సాధించింది.
మహిళల ఐఎల్సీఏ-4 కేటగిరీలో నేహా ఠాకూర్
11 రేసుల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 27 పాయింట్లు సాధించి రజత పతకం
గెలుచుకుంది. థాయిలాండ్ క్రీడాకారిణి నోపాసోర్న్ కుంబూంజన్ 16 పాయింట్లతో
స్వర్ణపతకం సాధించింది. సింగపూర్ క్రీడాకారిణి కైరా మేరీ కార్లయిల్ 28 పాయింట్లతో
కాంస్యపతకం గెలుచుకుంది.
సెయిలింగ్లో రజతంతో భారత్ పతకాల
పట్టికకు మరొకటి కలిసింది. ఇప్పటివరకూ భారత్ 12 పతకాలు గెలుచుకుంది. 2 స్వర్ణాలు,
4 రజత పతకాలు, 6 కాంస్య పతకాలు వచ్చాయి.
స్క్వాష్ క్రీడాంశంలోనూ భారత్ ఉత్తమ
ప్రతిభ కనబరిచింది. జోషన చినప్ప బృందం పాకిస్తాన్ టీంపై విజయం సాధించింది. గ్రూప్
స్టేజ్లో పాకిస్తాన్ను ఓడించిన భారత్, తర్వాతి రౌండ్లో బుధవారం నాడు చైనాతో
తలపడుతుంది. పురుషుల విభాగంలోనూ రాణించిన భారత జట్టు, సింగపూర్ను 3-0 తేడాతో
ఓడించింది.
పురుషుల 4X100 మీటర్ల మెడ్లే
రిలే టీమ్ ఫైనల్స్కు అర్హత సాధించింది. షూటింగ్లో మను బాకర్ 25 మీటర్ల పిస్టోల్
విభాగంలో సైతం క్వాలిఫై అయింది.
భారత పురుషుల హాకీ జట్టు
సింగపూర్పై 16-1 తేడాతో ఘనవిజయం సాధించింది.