ఆసియా
క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్
మ్యాచ్లో 19 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల
నష్టానికి 116 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో శ్రీలంక విఫలమైంది. దీంతో భారత్కు
స్వర్ణ పతకం దక్కగా శ్రీలంక రజతంతో సరిపెట్టుకుంది.
ఆసియా క్రీడల్లో క్రికెట్ను
ప్రవేశపెట్టిన తొలిసారే మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.
బ్యాటింగ్లో
స్మృతి మంధాన, 46 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులు చేశారు. టిటాస్
సాధు అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
షెఫాలీ వర్మ 9,
రిచా ఘోష్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. హర్మన్ ప్రీత్కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2
పరుగులు మాత్రమే చేశారు.
117
పరుగుల లక్ష్య ఛేధనలో శ్రీలంక పూర్తిగా విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో
8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేయగల్గింది. టిటాస్ సాధు 6 పరుగులు ఇచ్చి 3
వికెట్లు కొల్లగొట్టగా, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీశారు. దీప్తి శర్మ, పూజా
వస్త్రాకర్, దేవికా వైద్య తలో వికెట్ తీశారు.
ఆసియా గేమ్స్ లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు
తన ఖాతాలో వేసుకుంది. రెండు స్వర్ణాలు, 3
రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత పురుషుల
జట్టు స్వర్ణ పతకం గెలించింది.