ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి, సీరీస్ను
2-0తో కైవసం చేసుకుంది. మరో వన్డే మిగిలి ఉండగానే సీరీస్ను ఖాతాలో వేసుకుంది. మూడో వన్డే సెప్టెంబర్ 27న రాజ్కోట్ వేదికగా జరగనుంది.
తొలుత
బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 399 పరుగులు
చేసింది. శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేశారు. ఇందులో 11 ఫోర్లు, 3
సిక్సులు ఉన్నాయి. శుభ్మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేశారు. వీరిద్దరు రెండో
వికెట్కు 164 బంతుల్లో 200 పరుగులు చేశారు.
సూర్యకుమార్
యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్ గా ఉండగా, కేఎల్ రాహుల్ 38 బంతులకు 52
పరుగులు రాబట్టాడు.
వర్షం
పడటంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా డక్వర్త్ లూయిప్ పద్ధతి
ప్రకారం నిర్దేశించారు. ఛేదనలో కంగారూ జట్టు తడబడింది. ప్రసిధ్ తన తొలి ఓవర్లోనే
షార్ట్, స్మిత్లను పెవిలియన్ కు పంపాడు. వార్నర్, లబుషేన్ కలిసి మూడో వికెట్ కు
80 పరుగులు జోడించారు. వీరితో పాటు ఇన్గ్లిస్ను 12 పరుగుల వ్యవధిలో అశ్విన్
అవుట్ చేయడంతో ఆసీస్ గెలుపు ఆశలు అవిరి అయ్యాయి. తర్వాతి ఆటగాళ్లు కూడా పేలవ
ప్రదర్శన చేయడంతో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ
మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ అత్యధిక వన్డే స్కోర్ 399/5 నమోదు చేసింది. దీంతో
పాటుగా వన్డేల్లో 3 వేల సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ రికార్డు
నెలకొల్పింది. సూర్యకుమార్ యాదవ్ అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన భారత్ ఆటగాడిగా
ఘనత సాధించారు.