అరుణాచల్
ప్రదేశ్కు చెందిన ముగ్గురు వుషు క్రీడాకారులకు చైనా వీసా నిరాకరించడంపై కేంద్ర
క్రీడాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా చర్యను
భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తుందన్న కేంద్రమంత్రి, క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా చైనా
వ్యవహరించిందన్నారు.
చైనా చర్య వివక్షపూరితంగా ఉందని దుయ్యబట్టారు. వివక్ష
ఎన్నటికీ అమోదయోగ్యం కాదన్నారు.
అరుణాచల్
ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తెగ, మెపుంగా లాంగూ
జియావోషన్ చైనాలో సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు జరిగే మ్యాచ్లో ఆడాల్సి ఉంది.
అయితే వారికి వీసా మంజూరు చేసేందుకు చైనా నిరాకరించింది.
డ్రాగన్
చర్యకు ప్రతిచర్యగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనూరాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను
రద్దు చేసుకున్నారు.
అరుణాచల్
ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘటించారు. కోయంబత్తూరులో శ్రీకృష్ణ స్టేడియం
ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. క్రీడా విభాగంలో భారత్ను ఎవరూ
ఓడించలేరన్న కేంద్రమంత్రి, చెపాక్ స్టేడియం అద్భుతమన్నారు.
భారత ప్రభుత్వ దేశవ్యాప్తంగా 1000 ఖేలో భారత్
కేంద్రాలను నిర్మిస్తుందని వాటి ద్వారా మరింత మంది క్రీడాకారులు తయారు అవుతారని
ఆశాభావం వ్యక్తం చేశారు.