ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. తొలిరోజే రెండు పతకాలు దక్కాయి. మహిళల క్రికెట్లో మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల 10 మీ. షూటింగ్లో ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులి ఘోష్, రమిత టీమ్ రజత పతకాన్ని దక్కించుకుంది. పురుషులు లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్స్లో అర్జున్ లాల్,
అరవింద్ రజత పతకం గెలుచుకున్నారు.
భారత మహిళా టీం కూడా సత్తా చాటింది. ముందుగా టాస్ ఓడి బంగ్లాదేశ్ టీం బ్యాటింగ్ చేపట్టింది. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ టీంను చిత్తు చేసింది. బంగ్లా టీం 44 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లు మంధాన 7, షెఫాలీ వర్మ 17, జెమీమా రోడ్రిగ్స్ 20, కనికా 1 పరుగు చేసి లక్ష్యాన్ని ఛేధించారు. సెమీస్లో గెలవడంతో మరో పతకం ఖాయమైంది.