ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సీరీస్ లో భాగంగా భారత్ శుభారంభం చేసింది. మొహాలీలోని
పీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో
ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో భారత జట్టు, టెస్ట్, వన్డే టీ20 విభాగాల్లోనూ
అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన రెండో దేశంగా రికార్డుకెక్కింది.
టాస్
ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ 53
బంతుల్లో 52 పరుగులు చేశారు. ఇందులో 6 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. ఇన్గ్లిస్
45 బంతుల్లో 45 పరుగులు చేశారు. స్మిత్ 60
బంతుల్లో 41 పరుగులు చేయగా, లబుషేన్ 49 బంతుల్లో 39 రన్స్ చేశాడు. భారత బౌలర్ షమీ
51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
లక్ష్య
ఛేదనలో భాగంగా భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు చేసి విజయం సాధించింది.
ఓపెనర్లు శుభ్మన్ గిల్ 74 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 71 రన్స్ చేశారు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్ గా నిలవగా, సూర్యకుమార్ యాదవ్
అర్ధశతకంతో మెరుగైన ఆట ఆడారు.
ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని కీలకమైన
ఆటగాళ్లకు మొదటి రెండు మ్యాచుల్లో భారత్ విశ్రాంతి ప్రకటించింది. అయినప్పటికీ
భారత్ ఆటగాళ్లు అదరగొట్టి ఆసీస్ను ఓడించి, సీరీస్ లో 1-0తో ముందంజలో ఉన్నారు.