భారత్,
ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ల సీరీస్లో భాగంగా మొహాలీ వేదికగా ఇరుజట్లు
అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. తొలి రెండు మ్యాచ్లకు సీనియర్లకు
విశ్రాంతినిచ్చిన భారత్, రిజర్వ్ ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
రోహిత్
శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్కు తొలి రెండు మ్యాచ్ల
సందర్భంగా విశ్రాంతి ఇవ్వగా, కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నారు. శుభమన్ గిల్ తో
కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనుండగా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్
రాహుల్ మిడిలార్డర్ లో దిగుతారు.
మొహాలీలో
పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ వేదికపై ఆడిన చివరి ఐదు మ్యాచ్లలో నాలుగుసార్లు
మొదట బౌలింగ్ చేసిన జట్టు నెగ్గింది, దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ను
ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ
స్టేడియంలో నాలుగేళ్ళుగా వన్డే పోటీలు జరగలేదు. కానీ ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి.
ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. ప్రస్తుతం వర్ష సూచనలేకపోవడంతో
పాటు వాతావరణం పొడిగా వేడిగా ఉంది. దీంతో ఎలాంటి అవాంతరం లేకుండా మ్యాచ్ జరగనుంది.
ఈ పిచ్ పై అత్యధిక స్కోర్ చేసిన రికార్డు భారత్ పేరిట ఉంది.