Monday, December 11, 2023

Odisha-365
google-add
పాకిస్తాన్ చెప్పిన నిజం

డ్రోన్లతో దాయాది స్మగ్లింగ్.. నిజం చెప్పిన పాక్ ప్రధాని సలహాదారు..!

Editor | 13:18 PM, Fri Jul 28, 2023

సరిహద్దుల్లో పాక్ స్మగ్లర్ల దురాగతాలపై ఆ దేశ అత్యున్నత స్థాయి అధికారి విస్తుపోయే విషయాలు వెల్లడించారు. భారత్ లోకి అక్రమంగా డ్రగ్స్ తరలించడాన్ని BSF అధికారులు ఎప్పటి కప్పుడు చాకచాక్యంగా తిప్పికొడుతున్నారని చెప్పారు. సరిహద్దులో డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న విషయం నిజమేనని  పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు  సలహాదారుగా ఉన్న మాలిక్ మహమ్మద్ అహ్మద్ ఖాన్  అంగీకరించిన వీడియో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్లు హెరాయిన్ ను సరఫరా చేసేందుకు డ్రోన్స్ ఉపయోగిస్తున్నారన్నారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం కల్పించకపోతే వారంతా స్మగ్లర్ల ముఠాతో కలిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా దాదాపు ఖాళీ అయిందని.. సొంత ప్రజలకు తిండిపెట్టే పరిస్థితి కూడా లేదన్నారు.

కౌసర్ రేంజర్స్ ఏరియా సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో డ్రోన్స్  ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తుండగా బీఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు.  ఒక్కో డ్రోన్ కు పదికిలోల హెరాయిన్ కట్టి తరలిస్తుండగా ఇండియన్ అధికారులు వాటిని కూల్చివేశారని ఇలాంటి ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయని అంగీకరించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023