Thursday, November 30, 2023

Odisha-365
google-add
కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పు

Tamilnadu : సంచలన తీర్పు 383 ఏళ్ల జైలుశిక్ష .. రూ.3 కోట్ల జరిమానా


Editor | 12:00 PM, Sun Jul 30, 2023

నకిలీ డాక్యమెంట్లు తయారు చేసి తమిళనాడు ఆర్టీసీని మోసం చేసిన కేసులో  ఓ వ్యక్తికి కోయంబత్తూరు న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. నకిలీ పత్రాలతో కోదండపాణి అనే వ్యక్తి 47 బస్సులను ఓ సంస్థకు విక్రయించి రూ.28 లక్షలు మోసం చేశాడని 1988 నవంబరు 9న పోలీసులకు ఫిర్యాదు అందింది. తమిళనాడు కోయంబత్తూరు ఆర్టీసీ డివిజన్ బస్సుల వేలంలో నకిలీ పత్రాలతో కోదండపాణితో సహా మరో  8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.

చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దొరైస్వామి, రంగనాథన్,రాజేంద్రన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 1988 నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్,రాజేంద్రన్ ఇప్పటికే చనిపోయారు. ఈ కేసులో కోయంబత్తూర్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురుని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆర్టీసీని మోసం  చేసినందుకు కోయంబత్తూరు కోర్టు కోదండపాణికి 47 నేరాల కింద ఒక్కో నేరానికి నాలుగేళ్లు చొప్పున మొత్తం 188 ఏళ్లు శిక్ష, మరో 47 ఫోర్జరీ నేరాలకు ఒక్కోదానికి నాలుగేళ్ల చొప్పున మరో 188 సంవత్సరాలు, ప్రభుత్వ ఆస్తులు కాజేసినందుకు మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.  అంటే మొత్తం 383 ఏళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం నిందితుడి వయసు 82 సంవత్సరాలు. అతని వయసును పరిగణనలోకి తీసుకుని ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023