Thursday, November 30, 2023

Odisha-365
google-add
కమిటీ ఏర్పాటు

Supremecourt : మణిపూర్ అల్లర్లపై ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు

Editor | 17:10 PM, Mon Aug 07, 2023

మణిపూర్ అల్లర్లలో నష్టపోయిన బాధితులకు సహాయ,  పునరావాస పనులను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు  ముగ్గురు హైకోర్టు మాజీ జడ్జిలతో  కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అల్లర్ల కేసుల విచారణను కూడా పర్యవేక్షనుంది.  జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  గీతా మిత్తల్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో జస్టిస్ గీతా మిత్తల్‌తో పాటు, జస్టిస్ శాలినీ జోషి,  జస్టిస్ ఆశా మీనన్ సభ్యులుగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. మణిపూర్‌లో చట్టబద్దపాలనపై ప్రజలకు విశ్వాసాన్ని పునరుద్దరించే   చర్యల్లో భాగంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

మణిపూర్ అల్లర్లపై దాఖలైన కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారించింది. కేంద్ర, రాష్ట్రాల పక్షాన అటార్నీ జనరల్ ఆర్.వెంకటమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత వారం సుప్రీంకోర్టుకు మణిపూర్ అల్లర్లపై నివేదిక అందించారు. సుప్రీం ఆదేశాల మేరకు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ కూడా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. మణిపూర్‌లో హింసను అదుపు చేయడానికి తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు వివరించారు. హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు ఆయా జిల్లాల  ఎస్పీల పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసేందుకు సిద్దమని డీజీపీ కోర్టుకు తెలిపారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023