Thursday, November 30, 2023

Odisha-365
google-add

Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రి రాజగోపుర కలశాలకు బంగారు పూత

K Venkateswara Rao | 11:33 AM, Wed Sep 06, 2023

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం రాజగోపురానికి మరోసారి బంగారు పూత వేయించాలని పాలకమండలి నిర్ణయించింది. గురువారంనాడు దేవాలయ రాజగోపుర కలశాలను తొలగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపురంపై యంత్రాన్ని అలాగే ఉంచి, కేవలం కలశాలను మాత్రమే తొలగించాలని నిర్ణయించారు. పాత కలశాల స్థానంలో బంగారు పూత వేసిన కొత్త కలశాలను అమర్చనున్నారు.

దుర్గామల్లేశ్వరస్వామి ప్రధాన దేవాలయ రాజగోపురంపై తొమ్మిది కలశాలకు బంగారు పూత వేయించేందుకు ఇప్పటికే దాతల నుంచి రూ.45 లక్షల విరాళాలు సేకరించారు. నానో టెక్నాలజీతో కలశాలకు పూత వేయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలోనూ కలశాలకు బంగారు పూత వేయించారు. నాలుగేళ్లలో అవి వెలసిపోయి నల్లగా మారాయి. తాజాగా మరోసారి బంగారు పూత వేయించాలనే నిర్ణయంపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023