జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి తరవాత భారత్పై పది లక్షల సైబర్ దాడులు జరిగాయని మహారాష్ట్ర సైబర్ క్రైం అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడి తరవాత పాకిస్తాన్, ఇండోనేషియా, మొరాకో, పశ్చిమాసియా దేశాల నుంచి ఈ దాడులు జరిగినట్లు సైబర్ క్రైం నిపుణులు స్పష్టం చేశారు. భారత్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయన్నారు. ముఖ్యంగా వెబ్సైట్లు, సోషల్ మీడియాపై ఈ దాడులు చేసినట్లు గుర్తించారు. వేలాది వెబ్సైట్లను మొరాకో సైబర్ నేరగాళ్లు దాడులు చేసినట్లు గుర్తించారు.
ఉగ్రదాడి తరవాత భారత్ పాక్పై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వాఘా, అటారీ సరిహద్దులను మూసివేయడంతోపాటు, భారత్లోని పాకిస్థానీయులను పంపించి వేశారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల వేళ భారీగా సైన్యం మోహరించారు.