జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన మనీశ్ ఉగ్రమూకల దాడులో చనిపోయారు. భార్య ఇద్దరు పిల్లల కళ్ల ముందే మనీశ్ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. మనీశ్ ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారు. బిహార్కు మనీశ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు.