పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా బుధవారం పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హమాస్ కు చెందిన సీనియర్ నేత ప్రసంగించనున్నట్టు ప్రచారం జరిగింది.
రావల్కోట్ లోని సబీర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థల సీనియర్ నేతలు కూడా పాల్గొంటున్నారని వార్తలు బయటకు పొక్కాయి.
హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగిస్తారంటే కరపత్రాలు, ఇతర మాద్యమాల ద్వారా ప్రచారం చేశారు. కశ్మీర్ లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి ఆయన మాట్లాడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ భావిస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాడు జమ్మూకశ్మీర్ పై హైలెవెల్ మీటింగ్ ను నిర్వహించి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లపై సమీక్షించారు.
ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలతో 2024 ఆగస్టులో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ సమావేశం అయ్యాడు.అమెరికా 2018లోనే ఆయనను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు ఖలీద్ దగ్గరివాడు.