Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం క్రీడాకారులకు చెల్లింపులు నిలిపివేత

Phaneendra by Phaneendra
Jan 31, 2025, 05:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సంక్షోభంలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న 2024-25 సీజన్‌ను ఆర్థిక నిర్వహణలో అవకతవకలు, క్రీడాకారుల బాయ్‌కాట్‌లు, మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలూ కుదిపేస్తున్నాయి. బీపీఎల్ వ్యూయర్‌షిప్ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాటన్నిటికంటె దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా వెలుగు చూసింది. ఫ్రాంచైజీల యజమానులు క్రీడాకారుల చెల్లింపులను నిలిపివేసి మరీ, విదేశాల నుంచి మహిళా హోస్ట్‌లను తీసుకుని వచ్చారట. ఈ వార్త బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విశ్వసనీయతను మరింత దెబ్బతీసింది.

స్థానిక క్రికెటర్లకు మిగతా పోటీల కంటె బీపీఎల్ ఆర్థికంగా మెరుగైన అవకాశాలు కల్పించే పోటీ అయినా చెల్లింపుల విషయంలో ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉంటాయి. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలా టీములు తమ క్రీడాకారులకు నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయలేదు. దాంతో చాలామంది విదేశీ క్రీడాకారులు  గ్రౌండ్‌లోకి వెళ్ళడానికి సైతం నిరాకరించారు. కొంతమంది అయితే ఏకంగా మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసారు.

బీపీఎల్ నిబంధనల ప్రకారం సీజన్ జరిగే సమయంలో క్రీడాకారులకు 75శాతం చెల్లింపులు పూర్తి చేయాలి. కానీ ఈ సీజన్‌లో రాజ్‌షాహీ అనే జట్టు కేవలం నాలుగోవంతే చెల్లించింది. దానికి నిరసనగా ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ గత ఆదివారం నాడు మ్యాచ్ ఆడలేదు.

ఫార్చ్యూన్ బరిషాల్ అనే జట్టులో ఆడుతున్న ఇంగ్లిష్ క్రీడాకారుడు డేవిడ్ మలన్ ఇలాంటి పరిస్థితిని బహిరంగంగానే విమర్శించాడు. జనవరి 27న మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేరుగానే దుమ్మెత్తి పోసాడు. ‘‘మా పని క్రికెట్ ఆడడం. వారి పని సొమ్ములు చెల్లించడం. మీకు డబ్బులుంటే టీమ్‌ను తీసుకోండి. లేకపోతే లేదు. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదు’’ అని విమర్శించాడు.

మలన్ తమ జట్టయిన ఫార్చ్యూన్ బరిషాల్‌కు ఇలాంటి సమస్యలు లేవంటూ వివరణ ఇచ్చాడు. కానీ అతను చేసిన వ్యాఖ్యలతో మిగతా క్రీడాకారులు కూడా నోరువిప్పారు. ఆస్ట్రేలియన్ క్రీడాకారుడు విలియం బోసిస్టో కూడా పరిస్థితిపై తమ నిరాశను వ్యక్తం చేసాడు.  

బీపీఎల్ యజమానులు విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం భారీగా ఖర్చు చేయడం ఈసారి అత్యంత వివాదాస్పదమైన విషయంగా నిలిచింది. లీగ్‌కు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, క్రీడాకారులకు చెల్లింపులు చేయడాన్ని వదిలిపెట్టేసారు. దానికి బదులు అమ్మాయిలకు ప్రాధాన్యమిచ్చారు.

మచ్చుకి, యేషా సాగర్ అనే యువతిని ఫారిన్ ఫిమేల్ ప్రెజెంటర్‌గా పట్టుకొచ్చారు. యేషా కెనెడియన్ నటి, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె 2017లో పంజాబీ సంగీత పరిశ్రమలో తన కెరీర్ మొదలుపెట్టింది. పంజాబీ, హిందీ, తెలుగు భాషల్లో 30కి పైగా వీడియో ఆల్బమ్స్‌లో నటించింది. ఆమెను హోస్ట్‌గా తీసుకురావడానికి బీపీఎల్ నిర్వాహకులు భారీగానే ఖర్చుపెట్టారు. ఆ మేరకు క్రీడాకారులకు కోత పెట్టారు.

తమకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న స్థానిక క్రీడాకారులు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వారిపై చర్యలు తీసుకునే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.  

రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్తంగా అతివాద ఇస్లాం ప్రభావం పెరగడం వంటి కారణాలతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. దేశమంతటా అతివాదుల కార్యకలాపాలు పెరిగిపోవడం, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు చేయడం వంటి గొడవలతో బంగ్లాదేశ్ అంతటా ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో బీపీఎల్ సైతం సంక్షోభంలో కూరుకుపోయింది. అలాంటి సమయంలో క్రీడాకారులకు చెల్లింపులు మానేసి విదేశీ యువతులను తీసుకురావడం వివాదాస్పదంగా నిలిచింది.

Tags: bangladesh crisisBangladesh Premier LeagueDawid MalanDurbar RahshahiNo Payments to PlayersTOP NEWSYesha Sagar
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.