కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో రెండ్రోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చర్చల కోసం బీజింగ్ వెళ్లారు. 2020లో కరోనా సమయంలో ఈ యాత్రను నిలిపివేశారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య గత ఏడాది అక్టోబర్ లో రష్యాలోని కజాన్లో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో పాటు పునరుద్ధరణకు తగిన చర్యలు అవసరమని ఇరుదేశాలు నిర్ణయించాయి.
కైలాస పర్వతం, మానస సరోవర యాత్ర 2020లో నిలిచిపోయింది. కరోనా తగ్గినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త నేపథ్యంలో యాత్ర పునరుద్ధరణకు చైనా వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రస్తుతం యాత్ర పునురుద్ధరణకు ఇరుదేశాలు సమ్మతి తెలపడంతో పాటు విమాన సర్వీసులు ప్రారంభించించేందుకు అంగీకరించాయి. సంబంధిత ఫ్రేమ్ వర్క్ కోసం ఇరుదేశాల అధికారులు త్వరలో సమావేశం కానున్నారు.