దేశంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ అయిన ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పాల ధరలను తగ్గించినట్లుతెలిపింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా శుక్రవారం నాడు ఓ ప్రకటనలో ఈ విషయాన్నితెలిపారు.
అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ పాలపై రూ.1 చెప్పున తగ్గించినట్లు తెలిపారు. తాజా తగ్గింపు లీటర్ ప్యాక్కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. తగ్గింపు తర్వాత లీటర్ అమూల్ గోల్డ్ పాల ధర రూ.66 నుంచి రూ.65కి తగ్గగా. అమూల్ టీ స్పెషల్ మిల్క్ లీటర్ ధర రూ.62 నుంచి రూ.61కి, అమూల్ తాజా పాల ధర లీటరుకు రూ.54 నుంచి రూ.53కి తగ్గింది.
అమూల్, మదర్ డెయిరీలు చివరిసారిగా గతేడాది జూన్లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచాయి.