రాష్ట్రం అంతటా బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ దివస్ నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. ఆమె ఇవాళ సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమ బృందం ప్రతినిధులతో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.
సంవిధాన్ గౌరవ్ దివస్ కార్యాచరణకు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా – కర్ణాటక – అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఇంచార్జ్ ఎన్ మహేష్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంవిధాన్ గౌరవ్ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళేందుకు పురందేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమానికి రూపకల్పన చేసారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దళిత యువకులతో సహపంక్తి భోజనాలు, పోలింగ్ బూత్ స్థాయిలో సంవిధాన్ గౌరవ్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమం ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే విషయాలను పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్జీ వివరించారు.
సమావేశంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం రాష్ట్ర ఇంఛార్జిలు గుడిసె దేవానంద్, శరణాల మాలతీ రాణి తదితరులు పాల్గొన్నారు.