Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ఝార్ఖండ్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ షేరింగ్ ఫార్ములా ఖరారు

Phaneendra by Phaneendra
Oct 18, 2024, 05:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వచ్చే నెల జరగనున్న ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయం ఖరారయింది. మొత్తం 81 స్థానాలకు గాను బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుంది.

ఝార్ఖండ్‌లో బీజేపీతో పొత్తులో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు), జనతాదళ్ యునైటెడ్ (జెడియు), లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) ఉన్నాయి.

ఎజెఎస్‌యు 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. జెడియు 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎల్‌జెపి, ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఛాత్రాలో పోటీ చేస్తుంది. మిగిలిన 68 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుంది.

ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ, బీజేపీ ఝార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ శివరాజ్‌సింగ్ చౌహాన్, సహ-ఇన్‌ఛార్జ్ హిమంత బిశ్వ శర్మ, ఎజెఎస్‌యు అధ్యక్షుడు సుదేష్ మహతో ఈ మధ్యాహ్నం రాంచీలో మీడియాతో మాట్లాడారు.

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తాయని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘ఎజెఎస్‌యు, జెడియు, ఎల్‌జెపి, బిజెపి కలిసి పోటీ చేస్తాయి. సీట్‌షేరింగ్ మీద ఒప్పందం కుదిరింది. అభ్యర్ధుల ప్రకటన త్వరలోనే ఉంటుంది’’ అని చౌహాన్ వెల్లడించారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పొత్తుల సమీకరణాన్ని ప్రకటించారు. ‘‘ఎజెఎస్‌యు 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. జెడియు 2 సీట్లలోనూ, ఎల్‌జెపి 1 స్థానంలోనూ పోటీ చేస్తాయి. కొన్నిసీట్లలో పరిస్థితులను బట్టి సర్దుబాట్లు ఉంటాయి. ప్రస్తుతానికి పొత్తుసమీకరణాలు ఈ విధంగా ఖరారయ్యాయి’’ అని చెప్పారు.

ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 స్థానాలున్నాయి. అక్కడ నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. ఝార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో 1.31కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయబోతున్నవారు 11.84 లక్షల మంది ఉన్నారు.

Tags: AJSUandhra today newsAssembly ElectionsBabulal MarandiBJPHimanta Biswa SharmaJDUJharkhandLJPNDA AllianceSeat Sharing FormulaShivraj Singh ChauhanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.