Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

భారతీయ తత్వ చింతనలను పాఠశాల విద్యలో చేర్చాలి: వెంకయ్య నాయుడు

Phaneendra by Phaneendra
Oct 1, 2024, 11:14 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు భారతీయ తత్వచింతనే పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం ‘ప్రొ. సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ’  నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త సచ్చిదానందమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. సచ్చిదానందమూర్తి అముద్రిత రచనలను “ఆన్ ఎడ్యుకేషన్ & ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్” పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని, ఆయన స్మృతి చిహ్నంగా తీసుకువచ్చిన పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.

ఆ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “ఆధునిక విద్యాభ్యాసంలో తత్వశాస్త్రం ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకోవడం మనిషి వికాసానికి, సమాజ వికాసానికి మేలు చేసే విషయం. బాల్యదశ నుంచే పాఠ్య ప్రణాళికలో మన తత్వ విజ్ఞానాన్ని క్రమబద్ధమైన భాగంగా చేయడం వల్ల దీర్ఘకాలికంగా మన దేశానికి ఎంతో ప్రయోజనకరం” అని సూచించారు. వివిధ ఉపనిషత్తుల్లో మహర్షులు చేసిన బోధనలను ఉటంకించారు. వృక్షో రక్షిత రక్షితః, వసుధైవ కుటుంబకం, మానవసేవే మాధవసేవ, అహింసా పరమో ధర్మః వంటి భారతీయ తాత్విక బోధనలు ప్రపంచ సమస్యలకు  పరిష్కారం చూపిస్తాయన్నారు.

విద్యార్థి దశలోనే సరైన, సానుకూల బీజాలు నాటగలిగినప్పుడే మంచి పౌరులు, తద్వారా మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పారు. భారతీయ తత్వ దర్శనమే దానికి సరైన పరిష్కారం అన్నారు. “ప్రపంచం నలుమూలల విస్తరిస్తున్న పెడపోకడలకు భిన్నమైన సమాజంగా మనం ఎదగాలన్నా, ప్రపంచం మనల్ని అనుసరించాలన్నా తిరిగి మనం మన మూలాలకు వెళ్లాలి. మన విద్యా విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. నూతన విద్యా విధానం ఈ దిశగా కృషి చేస్తోంది. ” అని పేర్కొన్నారు.

“జీవ చైతన్యం, జీవితపు చైతన్యం విషయంలో భారత ఉపఖండం కొన్ని వేల సంవత్సరాలుగా మిగిలిన ప్రపంచం కన్నా ముందు ఉంది.  విశ్వ గురువుగా ఆవిర్భవించింది. ప్రపంచం నలుమూలల ఎంతోమందికి చైతన్యపు వెలుగులను చూపించింది. భారత ఉపఖండంలో ఈ జిజ్ఞాసతోనే ఎందరో ఋషులు, మహర్షులు అవతరించారు. వేద వేదాంగాలు,  ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, త్రిపిటకాలు అవతరించాయి. తత్వాన్ని బోధపరిచాయి. బోధపరుస్తూనే ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రంలో లౌకిక, అలౌకిక చింతనలు రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక, తార్కిక, శాస్త్ర విజ్ఞాన చింతనలు ఇమిడి ఉన్నాయి. ఇంతటి బహుళ తాత్వికచింతనలు ప్రపంచంలోని మరే దేశంలోనూ ఆవిర్భవించలేదు. తత్వపు వెలుగులను ప్రసరింప చేయడానికి ఈ పుణ్య భూమిలో ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు. ” అని చెప్పారు

20వ శతాబ్దంలో జిడ్డు కృష్ణమూర్తి గారు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత భారతీయ తత్వ శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప జ్ఞాని కొత్త సచ్చిదానందమూర్తి అని కొనియాడారు. “జ్ఞాన సముపార్జనలో, దాన్ని పదిమందితో పంచుకోవడంలో వారు చూపిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకం” అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సచ్చిదానంద మూర్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి ఎదగడం వెనక ఆయన స్వయంకృషి ఉందన్నారు.  సచ్చిదానందమూర్తి భారతీయ తత్వాన్ని అణువణువునా జీర్ణించుకొని ఆచరించి చూపిన ఆధునిక ఋషి అన్నారు. భారతీయ తత్వ దర్శనం లోనే కాకుండా ఇతర దేశాల్లోని తత్వచింతనలను  కూడా పూర్తిగా ఆకళింపు చేసుకున్న గొప్ప జ్ఞాన నిధి అని చెప్పారు. 

“మనకున్న సంపదను, విజ్ఞానాన్నీ పదిమందితో పంచుకోవాలని సనాతన ధర్మం బోధిస్తోంది. పంచుకుంటే పెరుగుతుంది కానీ తగ్గదు. ఆ సనాతన ధర్మాన్ని అణువణువునా నింపుకొని ఆయన ఆచరించి చూపించారు. తన విజ్ఞానాన్ని జీవితమంతా పంచుతూనే ఉన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు.” అని పేర్కొన్నారు. ఏఎన్‌యూలో నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి గారి  పేరిట ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నేటి తరం విద్యార్థులు శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, కామినేని శ్రీనివాసరావు, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. కె గంగాధర్ రావు, ప్రొ ఎం త్రిమూర్తి రావు, ప్రొ అశోక్  వోహ్రా, ప్రొ కేఎస్ చలం, ప్రొ కె రత్నషీలామణి, ప్రొ ఎన్వీ కృష్ణారావు, ప్రొ జి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Tags: andhra today newsBirth CentenaryM Venkaiah NaiduNagarjuna UniversityProf Kotta Satchidananda MurtySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఇంటర్ ఫలితాలు విడుదల
general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్
general

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.