Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

కాంగ్రెస్ పూర్తిగా అర్బన్ నక్సల్స్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది: మోదీ

Phaneendra by Phaneendra
Sep 28, 2024, 04:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై పూర్తిస్థాయి మాటల దాడులు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌ను తీవ్రంగా నిందించారు. సొంత దేశపు ప్రజలను అవమానిస్తూ, విదేశీ చొరబాటుదారులను దేశంలోకి ఆహ్వానించి వారిని ఓటుబ్యాంకులుగా మలచుకునే నికృష్ట మనస్తత్వం కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అర్బన్ నక్సలైట్ల నియంత్రణలోకి వెళ్ళిపోయిందని వ్యాఖ్యానించారు.

జమ్మూలో ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోదీ ‘‘మన వీరసైనికుల త్యాగాలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు. ఆ పార్టీని ఇవాళ అర్బన్ నక్సలైట్ల సానుభూతిపరులు హైజాక్ చేసారు. వారు విదేశీ చొరబాటుదారులను దేశంలోకి ఆహ్వానిస్తారు, వారిని ఓటుబ్యాంకులుగా మలచుకుంటారు. మన దేశపు నిజమైన ప్రజలు కష్టపడుతుంటే వారిని అపహాస్యం చేస్తారు’’ అంటూ మండిపడ్డారు.

‘‘జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న మార్పులను ఆ మూడు పార్టీలనూ తట్టుకోలేకపోతున్నాయి. మీ అభివృద్ధి వారికి ఇష్టం లేదు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తామంటున్నారు. వాళ్ళే అధికారంలోకి వస్తే అదే వివక్షాపూరిత పరిపాలనను తీసుకొస్తారు. వారివల్ల అత్యధికంగా నష్టపోయేది మన జమ్మూయే. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మూడు పార్టీలూ జమ్మూకు ఎప్పుడూ అన్యాయమే చేస్తూ వచ్చాయి. బుజ్జగింపు రాజకీయాల కోసం వారు ఏమైనా చేయగలరు. మీరు అతని ప్రసంగాలు వినాల్సిందే. డోగ్రా వారసత్వం మీద అతను ఎలా దాడి చేస్తాడో, మహారాజా హరిసింగ్‌ను అవమానించడానికి ఎలాంటి ఆరోపణలు చేస్తాడో తెలుసుకోవలసిందే’’ అంటూ విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ తప్పుడు విధానాలు, నిర్లక్ష్యం, ఉదాసీనత వల్ల జమ్మూకశ్మీర్ ప్రజలు స్వతంత్రం వచ్చిననాటినుంచీ ఎన్నో అవస్థలు పడుతూనే ఉన్నారని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘దశాబ్దాలుగా కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి పార్టీలు తమ నాయకుల, తమ కుటుంబాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎంత కష్టపడుతున్నా పట్టించుకోలేదు’’ అని మండిపడ్డారు.

బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సమృద్ధం చేసేందుకు శరవేగంగా పనిచేస్తుందని మోదీ చెప్పారు. స్థానికులకు ఇన్నాళ్ళూ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.

‘‘ఇవాళ కాంగ్రెస్ పూర్తిగా అర్బన్ నక్సలైట్ల నియంత్రణలో ఉంది. విదేశాల నుంచి చొరబాటుదార్లు వస్తే కాంగ్రెస్‌కు ఇష్టం. వారిలో ఆ పార్టీ ఓటుబ్యాంకును చూసుకుంటుంది. కానీ వారు మన సొంత ప్రజల ఈతిబాధలను చూసి అపహాస్యం చేస్తారు. కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి మూడు పార్టీలూ రాజ్యాంగానికి శత్రువులు. వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసారు. ఎన్నో తరాలుగా జమ్మూలో నివసిస్తున్న ఎన్నో కుటుంబాలకు నేటికీ ఓటుహక్కు లేదు. వారికి ఆ హక్కును కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి లేకుండా చేసాయి’’ అని దుయ్యబట్టారు.

2016లో తమ ప్రభుత్వం పాకిస్తాన్‌ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్‌ను విమర్శించిన, ఆ దాడులకు సాక్ష్యాధారాలు అడిగిన కాంగ్రెస్‌ను ఆయన తప్పుపట్టారు.  ‘‘మనది నవభారతం. మనం శత్రువు ఇంట్లోకి చొరబడి మరీ వాళ్ళను చంపుతాం’’ అంటూ పీఎం మోదీ, సాయుధ బలగాలు ఉగ్రవాద బృందాలపై దాడులు చేయడాన్ని వివరించారు.

‘‘మీకు గుర్తుందా, అటువైపు నుంచి తూటాలు కాల్చిన మరుక్షణమే కాంగ్రెస్ తెల్లజెండా ఎగరేసేది. శత్రువుల బులెట్లకు భారత్ షెల్స్‌తో జవాబిచ్చేసరికి అటువైపు ఉన్న ప్రజల మత్తు వదిలిపోయింది’’ అని చెప్పారు.

‘‘2016లో సరిగ్గా ఇదే రోజు సర్జికల్ దాడి జరిగింది. ఇండియా ప్రపంచానికి ‘మాది నవభారతం, శత్రువు ఇళ్ళలోకి చొరబడి మరీ చంపేస్తాం’ అన్న సందేశాన్ని ప్రపంచానికి అందించగలిగాం’’ అని మోదీ వివరించారు.

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ సమావేశాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25న పూర్తయ్యాయి. చివరిదైన మూడోదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న జరుగనుంది.

Tags: andhra today newsCongressInfiltratorsJK Election CampaignPM Narendra ModiSLIDERTOP NEWSUrban Naxals
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.