Tuesday, June 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

సందేశ్‌ఖాలీ కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగాల్సిందే: సుప్రీం

Phaneendra by Phaneendra
Jul 8, 2024, 04:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సందేశ్‌ఖాలీ హింసాకాండ కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలన్న కలకత్తా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించిన రాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలను తిరస్కరించింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల భూఆక్రమణలు, మహిళలపై లైంగిక దాడుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.    

జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం, కలకత్తా హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం పెట్టుకున్న అప్పీలును కొట్టిపడేసింది. షాజహాన్ షేక్, అతని అనుచరులు గిరిజనుల భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారని, అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న విషయాలు వెలుగుచూడడంతో కలకత్తా హైకోర్టు ఆ కేసును సుమోటోగా తీసుకుని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది.

బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. సందేశ్‌ఖాలీ ఘటనలపై విచారణకు రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఆయన వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా విచారణలు జరిపిందని, కమిషన్లు ఏర్పాటు చేసిందనీ చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల మీద దాడి అనే ఒక ఘటన నేపథ్యంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయనీ, వాటన్నిటిపైనా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించిందనీ సింఘ్వీ చెప్పారు. నిజానికి వాటిని ప్రత్యేకంగా విచారించాలని ఆయన వాదించారు.  

ఆ వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. సందేశ్‌ఖాలీ సంఘటనలకు సంబంధించిన అన్ని కేసులూ సిబిఐ దర్యాప్తు పరిధిలోకి వస్తాయని తేల్చిచెప్పింది. ఆ విషయంలో రాష్ట్రప్రభుత్వం జాప్యం చేయడాన్ని జస్టిస్ గవాయ్ తప్పుపట్టారు. నెలల తరబడి ఏ చర్యా తీసుకోకుండా కూర్చున్నారని మండిపడ్డారు. జస్టిస్ విశ్వనాథన్ కూడా అదేవిధంగా అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్ళక్రితం నమోదైన కేసులను సైతం బెంగాల్ పోలీసులు పరిష్కరించడం లేదన్నారు.

పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఏళ్ళ తరబడి అరాచకాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారే లేకపోయారు. కొన్నినెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కుంభకోణం విచారణకు ఆ ప్రాంతానికి వెడుతున్న ఈడీ అధికారులపైనే షాజహాన్ షేక్ అనుచరులు దాడులకు పాల్పడ్డారు. దాంతో సందేశ్‌ఖాలీ వార్తల్లోకెక్కింది. ఆ నేపథ్యంలోనే షాజహాన్ షేక్, అతని అనుచరులు తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో మహిళలను నిర్బంధించి నెలల తరబడి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

Tags: Calcutta HighcourtCBI InvestigationSandeshkhaliSLIDERSupreme CourtTOP NEWSWEST Bengal government
ShareTweetSendShare

Related News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.